ల్యాండ్ అవుతున్న విమానం లో మంటలు చెలరేగడం తో 41 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.ఈ ఘటన రష్యా లోని మాస్కోలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే….రష్యాకు చెందిన ఏరోఫ్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి బయలు దేరింది.
అయితే విమానం టేకాఫ్ అయినా కొద్దీ సేపటికే సాంకేతిక లోపం తలెత్తడం తో విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి.దీనితో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలో పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేస్తున్న సమయంలో విమానం నేలను బలంగా తాకింది.దానితో ఒక్కసారిగా విమానంలో మరింత మంటలు చెలరేగాయి.
దీనితో ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా,వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.అయితే వాస్తవానికి ప్రమాద సమయంలో విమాన సిబ్బంది తో పాటు మొత్తం 78 మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో 41 మంది మృతి చెందగా మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడగలిగారు.
అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తింది అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.అయితే టేకాఫ్ అయిన విమానం దాదాపు 45 నిమిషాల పాటు రెండు సార్లు గాల్లో చక్కర్లు కొట్టినట్లు ‘ఫ్లైట్ రాడార్’ తెలిపింది.
అయితే ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం ఒక కమిటీని నియమించి ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.అలానే భద్రతా నియమాలను పైలట్లు ఏమైనా ఉల్లంఘించారా అన్న అంశాలపై కూడా దర్యాప్తు చేయాల్సిందిగా రష్యా ప్రభుత్వం కమిటీ కి తెలిపింది.