కరీంనగర్ జిల్లా మానుకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
గుండ్లపల్లి -పొత్తూరు డబుల్ రోడ్డు ఎప్పుడు వేస్తారని ఫ్లెక్సీలలో ప్రశ్నించారు.రూ.71 కోట్ల నిధులు మంజూరు జీవో ఒట్టిదేనా అని నిలదీశారు.హామీలు ఇవ్వడమే కానీ నెరవేర్చడం లేదంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.