ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పద్యంలో ఎన్నో పాటలకు సంబంధించి టోర్నమెంట్స్ వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే ఎన్నో బాధలు పడిన తర్వాత నేడు శ్రీలంక ప్రీమియర్ లీగ్ మొదలు కాబోతోంది.
అయితే ఇంకా ఒక మ్యాచ్ జరగక ముందే అప్పుడే ఈ లీగ్ కు సంబంధించి ఫిక్సింగ్ తాకిడి మొదలైంది.ఇందులో భాగంగా మ్యాచ్ లను తమకు అనుకూలంగా ఫిక్స్ చేయాలని జాతీయ జట్టు కు చెందిన మాజీ క్రికెటర్ జరగబోయే లంక ప్రీమియర్ లీగ్ లో ఆడే ఆట గారిని కలిసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇందుకు సంబంధించిన ఫిర్యాదు అందుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి అలర్ట్ అయింది.
ఈ విషయం సంబంధించి తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి విచారణకు రంగం సిద్ధం చేసింది.
నిజానికి ఈ లీగ్ లో భారీ ఫిక్సింగ్ కు తెరలేపడానికి చూస్తున్నట్లు శ్రీలంక లోని స్థానిక పత్రిక లంక దీప తన కథనంలో రాసుకొచ్చింది.ఈ ఫిక్సింగ్ లో విదేశీ ఆటగాడిని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున్న ఫిక్సింగ్ తెరలేపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్ లీగ్ ఎట్టకేలకు నేటినుంచి మొదలు కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి విషయం తెరమీదకు రావడంతో మరోసారి గందరగోళానికి గురవుతున్నారు.
ఇక ఈ లీగ్ పూర్తిగా ఆలస్యం అవ్వడంతో ఇప్పుడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, డుప్లెసిస్ ఆటగాళ్లు ఇక్కడ ఆడేందుకు అవకాశం లభిస్తోంది.
ప్రజల ఐపీఎల్ ఆడిన వీరిద్దరు నుండి నేరుగా శ్రీలంక ఆడేందుకు వెళ్లనున్నారు.ముందస్తు నిర్ణయించిన విధంగా ఈ లీగ్ ఆగస్టు నెలలో మొదలవ్వాల్సి ఉండగా ఆ తర్వాత నవంబర్ 14 వాయిదా పడింది.
చివరికి అది కూడా కాదనుకునికి మళ్ళీ నవంబర్ 24 నుండి మొదలుపెట్టాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.నేటితో మొదలవుతున్న లీగ్ డిసెంబర్ 16వ తేదీ వరకు జరగనుంది.
అయితే ఈ లీగ్ కు కూడా ప్రేక్షకులను అనుమతించరు.