తమిళనాడులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.నమ్మిన స్నేహితులే ఐదేళ్ల చిన్నారి పై దారుణానికి పాల్పడడం సంచలనం రేపింది.
వివరాల్లోకి వెళితే… తమిళనాడు లోని గోపాలపురం కు చెందిన ఒక యువకుడి కి కార్తి,మురుగన్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు.అయితే ఎంతో స్నేహంగా ఉండే ఈ ముగ్గురూ నిత్యం మద్యం సేవిస్తూ పార్టీ లు చేసుకొనేవారు.
అంత స్నేహంగా ఉండడం తో ఆ యువకుడు వారిని ఎంతో నమ్మాడు.ఈ క్రమంలో ఇటీవల కూడా అలానే ముగ్గురు కలిసి మద్యం సేవించిన తరువాత ఆ యువకుడు తన ఇంటికి ఆహ్వానించాడు.
దీనితో ఆ యువకుడితో కలిసి కార్తి,మురుగన్ లు ఆ యువకుడి ఇంటికి వెళ్లారు.
అయితే ఇంట్లో ఉన్న ఐదేళ్ల చిన్నారి ని ఆడిస్తూ కాసేపు ఉన్న వారిద్దరూ ఆ తరువాత ఆ చిన్నారి కి మిఠాయి కొనిస్తామని చెప్పి బయటకు తీసుకెళ్లారు.
అయితే బయటకు వెళ్లిన వారు ఎంతసేపటికి రాకపోవడం తో అనుమానం వచ్చిన ఆ చిన్నారి తండ్రి వారిని వెతికే పనిలో పడ్డాడు.అయితే అన్ని చోట్ల వెతుకుతుండగా, అతడి ఇంటికి సమీపంలో ఆ చిన్నారి రక్తమోడుతూ కనిపించింది.
దీనితో ఒక్కసారిగా రగిలిపోయిన ఆ చిన్నారి తండ్రి వెంటనే అక్కడే ఉన్న కార్తి,మురుగన్ లపై కత్తితో దాడికి దిగాడు.అయితే మురుగన్ తప్పించుకున్నాడు కానీ కార్తి మాత్రం ఆ చిన్నారి తండ్రి చేసిన దాడిలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.
ఎంతో నమ్మి ఇంటికి వచ్చిన ఆ ఇద్దరూ ఇలా ఐదేళ్ల చిన్నారి పై ఇలాంటి దారుణానికి పాల్పడడం ఆ చిన్నారి తండ్రి హృదయం అగ్ని లా రగిలిపోయింది.
దీనితో వారిపై అతడి వద్ద ఉన్న కత్తి తో దాడికి దిగాడు.
ఈ క్రమంలోనే కార్తి మృతి చెందగా,మురుగన్ మాత్రం అక్కడ నుంచి తప్పించుకున్నాడు.ఓచోట బాలిక రక్తమోడుతూ కనిపించడం తో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన తండ్రి కత్తి అందుకుని కార్తిని తలపై నరికాడు.
దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందగా.మరో నిందితుడు మురుగన్ పారిపోయాడు.
ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.