ఐదంతస్తుల భవనం నేలమట్టం.. మృత్యుంజయుడై ఓ బాలుడు

ఐదంతస్తుల భవనం నేలమట్టం అయింది.47 ఫ్లాట్లు, 250 కుటుంబాలు నివసిస్తున్న అపార్ట్ మెంట్ ఒక్కసారిగా కుప్పకూలింది.పరిసర ప్రాంతమంతా దట్టమైన దుమ్ము, ధూళితో కమ్మేసింది.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 18 గంటల వరకు శ్రమించారు.స్థానికుల్లో ఒకటే ఆందోళన.భవనం కూలడంతో ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని, కానీ ఓ బాలుడు మృత్యుంజయుడిలా బయటపడ్డాడు.

 Maharastra, Building, Demolished, Boy-TeluguStop.com

మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.పదేళ్ల క్రితం నిర్మించిన భారీ భవనం చూస్తుండగానే నేలమట్టం అయింది.భారీ శబ్దం చేసుకుంటూ భవనం కుప్పకూలింది.అల్లర్లు, ఏడుపుల మధ్య ఒక్కసారిగా నిశబ్దం చోటు చేసుకుంది.

ప్రాంతం చుట్టు పక్కల మొత్తం దుమ్ము, ధూళితో నిండిపోయింది.సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 18 గంటల పాటు శ్రమించిచారు.

స్వల్ప గాయాలతో ఓ చిన్నారి బయటపడ్డాడు.అది చూసి స్థానికులందరూ షాక్ కి గురయ్యారు.

వీడు సామాన్యుడు కాడు మృత్యుంజయుడని ఆశ్చర్యపోయారు.అధికారులు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రస్తుతం ఆ ప్రదేశంలో అందిరికీ ఒకే టెన్షన్.250 కుటుంబాలు నివాసముంటున్న అపార్ట్ మెంట్ లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని భయాందోళన చెందుతున్నారు.ప్రాణహాని జరగకుండా ప్రజలు బయటపడాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube