చైనాలో మరో ఘోరం.. వణికిపోతున్న ప్రజలు!

ఈ మధ్య కాలంలో చైనా వేర్వేరు విషయాల్లో వార్తల్లో నిలుస్తూ వస్తోంది.చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల ప్రజల్లో తీవ్ర భయాందోళనను పెంచుతోంది.

 Five People Killed After Building Collapses In China,five People Killed, Hotel-TeluguStop.com

కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.

వైరస్ విషయంలో ప్రపంచ దేశాల నుంచి చైనాపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఇదే సమయంలో చైనాలో ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా చైనాలోని నార్త్ షాంక్సీ ప్రావిన్స్‌లో రెండతస్తుల భవనం కుప్పకూలింది.చైనా సెంట్రల్ టెలివిజన్ ఈ విషయాలను వెల్లడించింది.

ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

నిన్న ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.పోలీసులు, మిలిటరీ, అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించారు.

అధికారులు ప్రమాదానికి గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.పోలీసులు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube