హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్ళు కెరియర్ ని పూర్తి చేసుకున్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.చందమామ సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు టాలీవుడ్ చందమామగా తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.
మగదీర తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో ఆదిపాడిన ఈ అమ్మడు ఇప్పటికి తన హవాని కొనసాగిస్తుంది.ప్రస్తుతం ఆమెతో పాటు స్టార్ హీరోయిన్స్ గా చలామణి అయిన తమన్నా, సమంత లాంటి భామలు వెనుకబడిన కాజల్ అగర్వాల్ మాత్రం దూసుకుపోతుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఏకంగా నాలుగు పెద్ద ప్రాజెక్ట్ లు ఉండటం విశేషం.
అందులో ఇప్పటికే కమల్ హసన్ కి జోడీగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ సెట్స్ మీద ఉంది.
ఈ సినిమా కోసం కాజల్ ప్రత్యేకంగా యుద్ధ కళని కూడా నేర్చుకుంది.మరో వైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా కాజల్ ఎంపికైంది.
మరో వైపు బాలీవుడ్ లో సంజేయ్ గుప్తా దర్శకతంలో ముంబాయి సాగా అనే సినిమాకి ఒకే చెప్పింది.ఇప్పుడు మురుగదాస్ స్టార్ హీరో విజయ్ తో తెరకెక్కించబోతున్న సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.
అయితే ఇది తుపాకి సీక్వెల్ అని టాక్ వినిపించిన, పూర్తిగా కొత్త కథతో మురుగదాస్ ఈ సినిమాని ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా కోసం కాజల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి చందమామ మరో రెండేళ్ళకి సరిపడే విధంగా తన చేతిలో పెద్ద ప్రాజెక్ట్ లని పెట్టుకొని బిజీగా ఉందని చెప్పాలి.
మరో వైపు రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే రాక్షసరాజు రావణాసురుడు సినిమాలో హీరోయిన్ గా కూడా కాజల్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.