అమెరికాలో మరోసారి కాల్పులు జరిగిన ఘటన కలకలు సృష్టిస్తోంది.ఈ వరుస ఘటనలతో అమెరికాలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
తుపాకీ చట్టంపై మార్పు తీసుకురావాలి ఎంతోమంది ఆందోళనలు చేస్తున్నా సరే అమెరికా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలో వైఫల్యం చెందుతోందని అంటున్నారు స్థానిక ప్రజలు.తాజాగా జరిగిన కాల్పుల ఘటన లో సుమారు ఐదు మంది మృతిచెందగా, 21 మంది తీవ్ర గాయాల పాలయ్యారు వివరాల్లోకి వెళ్తే.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఒడెస్సా ప్రాంతంలో ఇద్దరు దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు మృతి చెందగా సుమారు 21 మంది గాయపడ్డారు.
గాయపడిన వారిలో ముగ్గురు పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఘటన తాలూకు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వారిలో ఒక దుండగుడిని మట్టుబెట్టారు
టయోటా కారులో వచ్చిన దుండగులు ముందుగా అమెరికా పోస్టర్ సర్వీస్ కారుని దొంగిలించారు.కొంత దూరం వెళ్ళిన తరువాత అక్కడ కారుని ఆపి స్థానికంగా ఉన్న పౌరులపై కాల్పులు జరిపారు.అయితే ఈ దాడిని ఇద్దరు వ్యక్తులు చేశారని వారిలో ఒక వ్యక్తిని పోలీసులు మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది.
అసలు ఈ ఘటనలో పాల్గొంది ఇద్దరా, లేక ఎంతమంది ఉన్నారు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి మిగిలిన వారికోసం గాలింపు చేపట్టారు.