శాన్డియాగోలో దారుణం జరిగింది.పారడైజ్ హిల్స్ పరిసరాల్లోని ఇంట్లో ఐదుగురు అనుమానాస్పద స్ధితిలో నిర్జీవంగా పడివున్నారు.
వీరిలో పదేళ్లలోపు ముగ్గురు బాలురు ఉన్నారు.లెఫ్టినెంట్ మాట్ డాబ్స్ మీడియాతో మాట్లాడుతూ.
శనివారం పారడైజ్ హిల్స్ ప్రాంతంలోని కొందరు స్ధానికులు తమకు పక్కింటి నుంచి తుపాకీ చప్పుళ్లు వినిపిస్తున్నాయని 911కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు.
అక్కడ 31 ఏళ్ల పురుషుడు, 29 ఏళ్ల మహిళ పదేళ్లలోపు ముగ్గురు చిన్నారులు చనిపోయి పడివున్నారు.తీవ్రగాయాల పాలైన 11 ఏళ్ల మరో బాలుడిని ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కారణాల వల్ల 31 ఏళ్ల వ్యక్తి తన భార్య, నలుగురు పిల్లలను కాల్చి తాను ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.సదరు వ్యక్తి భార్య తన భర్తకు దూరంగా ఉండేందుకు కోర్టు నుంచి అనుమతి పొందిందని డాబ్స్ తెలిపారు.
అయితే ఈ ఆదేశం నిందితుడికి తెలుసా లేదా అన్న దానిపై స్పష్టత లేదు.ఆస్తి సంబంధిత వివాదంపై నవంబర్ 1న అధికారులు అదే చిరునామాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
నిందితుడు తన భార్య నుంచి కొన్ని ఉపకరణాలు అడగటం వల్లే ఇద్దరి మధ్య వివాదం చెలరేగడానికి కారణంగా తెలుస్తోంది.అదే సమయంలో భర్త నుంచి దూరంగా ఉండేందుకు కోర్టు ద్వారా ఉత్తర్వులను ఎలా తీసుకోవాలో పోలీసులు ఆమెకు సలహా ఇచ్చారు.మృతుల ఇంటికి పక్కనే నివసిస్తున్న శాన్య గోర్డాన్ మాట్లాడుతూ.తాను శనివారం తుపాకీ కాల్పుల శబ్ధం విని పోలీసులకు ఫోన్ చేశానని తెలిపారు.తనకు వారి పిల్లలు వ్యక్తిగతంగా తెలియదని.అయితే వారు బయట వున్న ఇతర పిల్లలతో ఆడుకోవడం మాత్రమే చూశానని తెలిపారు.