ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతుంటాయి.కాని ఇండియాలో మాత్రం అలాంటి వింతలు విడ్డూరాలు జరిగితే వాటిని దైవం చేయించిందని, దైవ స్వరూపం అంటూ జనాలు ప్రచారం చేయడం జరుగుతుంది.
ఇండియాలో దైవ భక్తి ఎక్కువ అనేందుకు ఎన్నో సార్లు నిరూపితం అయ్యింది.కొత్తగా వింతగా ఏది కనిపించినా కూడా దాన్ని దైవత్వానికి ముడి పెడుతూ పూజలు చేయడం మనోళ్లకు ఉన్న అలవాటు.
ఇలా అని మనవారిని అవమానించడం కాదు గాని కొన్ని సార్లు వారు చేసే పనులకు నవ్వుకోవాలో, వారిపై కోపం తెచ్చుకోవాలో అర్థం కాదు.
విషయం ఏంటీ అంటే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కొత్తలోలం అనే గ్రామంలో మహ్మద్ అజారుద్దీన్ గోషాలను నిర్వహిస్తూ ఉన్నాడు.
పాల వ్యాపారం చేస్తున్న ఆయన గోషాలలోని ఒక ఆవు ఇటీవలే లేగ దూడకు జన్మనిచ్చింది.దూడ పాల పొదుగు పెద్దగా ఉండటంను గమనించిన యజమాని పితికేందుకు ప్రయత్నించాడు.
అందులోంచి పాలు వస్తుండటంతో అతడు ఆశ్చర్య పోయాడు.ఒకటి కాదు రెండు కాదు లీటర్లకు లీటర్లు ఆ పొదుగు నుండి పాలు వస్తూనే ఉన్నాయి.
ఈ విషయం అక్కడ ఇక్కడ తెలిసి అందరికి పాకింది.దాంతో అంతా కూడా అవాక్కవుతూ ఉన్నారు.
కొందరు అయితే ఈ లేగ దూడను దేవుడి ప్రతిరూపంగా పూజించడం మొదలు పెట్టారు.చాలా మంది ఈ దూడను చూసి అబ్బురపడిపోతున్నారు.అయితే వైధ్యులు మాత్రం ఆ దూడకు జెన్యూ లోపం కారణంగా అలా జరుగుతుందని, కొంత కాలం తర్వాత జరగాల్సిన జన్నుమార్పు ముందే జరగడంతో పాలు ఇస్తుంననట్లుగా నిర్థారించారు.అందులో అంతకు మించి విడ్డూరం ఏమీ లేదు.
అద్బుతం అంతకు మించి లేదు.ఆ ఆవు దూడ అనారోగ్యంతో ఉంది, అది ఎక్కువ కాలం బతికే అవకాశం కూడా లేదని వారు అంటున్నారు.
ఆ పాలను తాగకపోవడం మంచిదంటూ వైధ్యులు చెబుతున్నారు.