సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి సారి ఏకంగా తొమ్మిది మంది జడ్జీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి లైవ్ లో చూపించనున్నారు.
ఇటీవల సుప్రీం కోర్ట్ కి కొత్తగా తొమ్మిదిమందిని న్యాయమూర్తులుగా నియమించేందుకు రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్ విడుదల చేయటం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొత్తగా నియమించిన తొమ్మిది మంది న్యాయమూర్తుల చేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ..ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
కొత్తగా 9 మంది న్యాయమూర్తులు నిమిత్తం కావటంతో సుప్రీంకోర్టు లో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33 కి చేరుకుంది.ఇదిలా ఉంటే కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా సేవలందించిన హిమ కోహ్లీ కూడా ఉన్నారు.ఈమెతో పాటు నాగరత్న, బేల త్రివేది, అశోక, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరి, సిటీ రవికుమార్, ఎంఎం సుందేరశ్, సీనియర్ న్యాయమూర్తి పిఎస్ నరసింహ.సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ఈరోజు ప్రమాణస్వీకారం చేస్తున్నారు.