ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మొట్ట మొదటిసారి ఇండియన్ ఆర్మీ కు కూడా పాకింది.ఇప్పటివరకు భారత దేశవ్యాప్తంగా రాష్ట్రాల ప్రజలను అల్లాడిస్తూ వచ్చిన ఈ కరోనా మొదటిసారిగా భారత ఆర్మీ జవాన్ కు కూడా సోకినట్లు తెలుస్తుంది.
జమ్మూకాశ్మీర్ లోని లడఖ్ ప్రాంతంలో భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్న ఒక జవాన్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలినట్లు తెలుస్తుంది.దీనితో వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఆ జవాన్ ను ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే ఇటీవల ఆర్మీ జవాన్ తండ్రి ఇరాన్ దేశంలో పర్యటించి తిరిగి వచ్చాడని ఆయనకు కూడా కరోనా పాజిటివ్ తేలినట్లు వైద్యులు తెలిపారు.అయితే జవాన్ తండ్రి ద్వారా నే జవాన్ కు ఈ వైరస్ సోకిందేమో అని వైద్యులు భావిస్తున్నారు.
అయితే కుటుంబంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడం తో అతని మిగిలిన కుటుంబసభ్యులను కూడా ఐసోలేషన్ గదులకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు సమాచారాం.
ఆర్మీ జవానుతోపాటు అతని కుటుంబసభ్యులందరినీ లడఖ్ నగరంలోని ఆసుపత్రిలో ఐసోలేషన్ గదులకు తరలించారు.ఆర్మీ జవానుకు కొవిడ్-19 పాజిటివ్ అని రావడంతో భారత సైన్యం అప్రమత్తమైనట్లు తెలుస్తుంది.క్షణాల్లోనే ఈ వైరస్ ఇతరులకు పాకుతుండడం తో ప్రతి ఒక్కరూ శుభ్రత ను పాటించాలి అంటూ పలువురు సూచిస్తున్న విషయం తెలిసిందే.
చైనా లో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 6 వేల మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే.