ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19)కు మందు కనిపెట్టే ప్రయత్నం అన్ని దేశాలలో జరుగుతుంది.ఎవరికీ వారు తమ శక్తి మేరకు వాక్సిన కనిపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా ముందడుగు వేసింది.కరోనా వైరస్ కి వాక్సిన్ ని తయారు చేసి చేసి తొలి ట్రయల్గా ఓ మహిళపై ప్రయోగించింది.
సియాటిల్కు చెందిన 43 ఏళ్ళ మహిళ హాల్లెర్పై వాక్సిన్ను తొలిసారి ప్రయోగించామని అమెరికా అధికారికంగా ప్రకటించింది.అదే మహిళకు రెండో ఇంజెక్షన్ కూడా ఇచ్చామని స్పష్టం చేసింది.
క్లినికల్ ట్రయల్స్లో భాగంగా హాల్లెర్కు రెండు ఇంజెక్షన్లు చేయడం జరిగింది.మార్చి 16వ తేదీన కరోనా వాక్సిన్ను ప్రయోగాత్మకంగా వినియోగించామని, సియాటిల్లోని కైజర్ పెర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో ఈ ప్రయోగం జరిగిందని అమెరికా వివరించింది.
పూర్తిగా ఆరోగ్యంగా వున్న మొత్తం 45 మందిని సియాటిల్ లేబొరేటరీ ఎంపిక చేసి వారిలో జెన్నిఫర్ హాల్లెర్ కి మొదటిగా ప్రయోగించింది.కరోనా వైరస్ వాక్సిన్ను తొలిసారి తీసుకున్న జెన్నీఫర్ హాల్లెర్… కరోనాపై ప్రపంచం ఏమీ చేయలేక చతికిలా పడిన సందర్భంలో తనకు ఈ అవకాశం దక్కడం ఆనందంగా వుందని వెల్లడించింది.
ప్రయోగంలోను భాగస్వామిగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.