నేచురల్ స్టార్ నాని, సుధీర్బాబు తొలిసారి కలిసి నటించిన చిత్రం `వి`.ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు.
ఈ తరహా యాక్షన్ థ్రిల్లర్ని ఈ దర్శకుడు అందించడం ఇదే తొలిసారి.దిల్ రాజుతో కలిసి శిరీష్, హర్షిత్రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో అదితీరావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు.
సెప్టెంబర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతోంది.దాదాపు 200 దేశాల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది.
వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ముందుగా మార్చి 25న రిలీజ్కు రెడీ అయ్యింది.
కరోనా నేపథ్యంలో వాయిదా పడడం.
ఇప్పట్లో థియేటర్లు తెరచుకునే ఛాన్స్ లేకపోవడంతో చివరకు డిజిటల్ ప్లాట్ ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు.నేచురల్ స్టార్ నాని నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటించిన ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా సుధీర్బాబు కనిపించబోతున్నారు.
ఓ సైకో కిల్లర్ , పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ మధ్య సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం డిజిటల్ వరల్డ్ లో తొలి రోజు సునామీ సృష్టించబోతున్నట్టు తెలుస్తోంది.ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే 11 మిలియన్ వ్యూస్ని దాటి స్టిల్ కౌంటింగ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో తొలి రోజు ఏ స్థాయిలో వ్యూస్ వుండబోతున్నాయనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.భారీ చిత్రాల నిర్మాతల నుంచి స్టార్ హీరోలు, క్రేజీ డైరెక్టర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఊహించిన మార్క్ని దాటి `వి` రికార్డు స్థాయి వ్యూస్ని రాబట్టగలిగితే ఓటీటీ రంగంలో సరికొత్త రికార్డు నమోదు కావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.మరి నాని ఆ మార్కుని సాధిస్తుందా? లేదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకు వేచి చూడాల్సిందే.