మొట్టమొదటిసారి కంటే రెండోసారి వచ్చిన వైరస్ అనగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇండియా పై బాగా చూపిన సంగతి తెలిసిందే.మొదటిసారి వచ్చిన వైరస్ ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో మధ్యలో గ్యాప్ రావడంతో.
దేశ ప్రజలలో వైరస్ అంటే భయం లేకుండా ఉండటంతో రెండోసారి చాప కింద నీరులా మెల్లగా పాకిపోయి ఒక్కసారిగా విజృంభించింది.దీంతో దేశంలో ఒక్కసారిగా దాదాపు రోజుకు ఐదు లక్షలకు దగ్గరలో కేసులు.
బయటపడటంతో పాటు మరో పక్క.కరోనా బారిన పడిన రోగులు ఆక్సిజన్ అందక అనేక అవస్థలు పడటంతో దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ సిలిండర్ లకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
దీంతో మిగతా ప్రపంచ దేశాలు ఇండియా దేశాన్ని ఆదుకోవడం కోసం రకరకాలుగా మెడికల్ సాయం అందించారు.
ఇదే తరుణంలో వ్యాక్సిన్లు అందుబాటులో వచ్చినా గానీ అతి పెద్ద దేశ జనాభా కావటంతో కేవలం ఇప్పటివరకు వ్యాక్సినేషన్ ద్వారా దేశంలో ప్రజలకు 25.90 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందించారు.ఈ క్రమంలో వ్యాక్సిన్ వేసుకున్న కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే వ్యాక్సిన్ తీసుకున్నాక మొట్టమొదటిసారి ఇండియా వ్యక్తి చనిపోవటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
చాలా దేశాలలో వచ్చిన వ్యాక్సిన్ వలన సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే వచ్చాయి.ఇండియాలో కూడా అదే ప్రభావం మొదటిలో కనబడగా.ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుని అది వికటించి మనిషి మరణించటం సంచలనంగా మారింది.
మొదటిలో అనేక మరణాలు సంభవించిన కానీ ప్రభుత్వాలు పెద్దగా ధ్రువీకరించలేదు.కానీ తొలిసారి .మార్చి 8వ తారీఖు 68 ఏళ్ల వృద్ధుడు వ్యాక్సిన్ తీసుకోగా అతడు ఇటీవల మరిణించడం జరిగింది.దీంతో అతడు తీసుకున్న వ్యాక్సిన్ వికటించిన వల్లనే మరణించినట్లు రిపోర్టులో ధ్రువీకరించారు.