నార్త్ కొరియా పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.నియంత పాలన చేస్తూ అగ్రరాజ్యం అమెరికా కు సైతం హెచ్చరికలు జారీ చేసిన వ్యక్తి.
ఇటీవల ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ పై అధికారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.ఆ వైరస్ అనేది నార్త్ కొరియా లో రాకూడదు లేదంటే పరిస్థితులు మారిపోతాయి అంటూ హెచ్చరించారు.
దీనితో కరోనా విషయంలో వారు అవలంబిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తాయి.అయితే తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.
తోలి కరోనా పాజిటివ్ కేసు బాధితుడిని అధ్యక్షుడు కిమ్ ఆదేశాల మేరకు అక్కడి అధికారులు కాల్చి చంపినట్లు తెలుస్తుంది.మామూలుగా కిమ్ నియంత పాలన చేస్తారని,ఆయనకు జాలి,దయ అన్న పదాలకు తావుండదు, అందుకే ఇటీవల కరోనా వైరస్ ఉంది అన్న అనుమానంతో ఏకంగా ఒక అధికారినే నిర్ధాక్షణీయంగా కాల్చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పడు తాజాగా మరో కరోనా పాజిటివ్ బాధితుడి ని కూడా కిమ్ ఆదేశాల మేరకు అధికారులు కాల్చి చంపినట్లు తెలుస్తుంది.అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు?ఎక్కడ నుంచి వచ్చాడు?అసలు నార్త్ కొరియా కు చెందిన వాడా లేదా మరేదేశానికి చెందినవాడా అన్న వివరాలు కూడా బయటకు రాలేదు.అయితే ప్రాణాంతక కరోనా వైరస్ ఇతరులకు సోకకుండా ఉండేందుకే ఆ దేశ నియంత అధికారులకు ఆదేశాలు జారీ చేసి తొలి కరోనా బాధితుడిని చంపమని కిమ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.