కరోనా వైరస్ ఇప్పటికే భారతదేశంలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది.
కాగా తెలంగాణలో ఇప్పటికే 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా ఈ లెక్క 65కు చేరింది.
ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తాజాగా ప్రకటించారు.
హైదరాబాద్కు చెందిన ఓ 74 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.కాగా శనివారం తెలంగాణ రాష్ట్రంలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.
పాతబస్తీలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా సోకిందని తెలుస్తోంది.
అటు కరోనాతో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులను క్వారంటైన్లో పెట్టినట్లు ఈటెల తెలిపారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.