రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు తీవ్రమైన ఆంక్షలను విధించాయి.ఈ నేపథ్యంలోనే కువైట్ లో కరోనా కేసులు అధికంగా ఉండడంతో కువైట్ ప్రభుత్వం మరింత కఠినమైన ఆంక్షలను విధించింది.
ఈ విధంగా ఆంక్షలు విధించడంతో ప్రతి ఒక్క రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.ముఖ్యంగా హోటళ్లను, రెస్టారెంట్లను నడిపే వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో కస్టమర్లు లేక రెస్టారెంట్లు బోసిపోతున్నాయి.
అదేవిధంగా రెస్టారెంట్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి.రెస్టారెంట్లలో కేవలం డెలివరీ సర్వీసులకు మాత్రమే అనుమతి లభించింది.
రెస్టారెంట్లలో డైన్-ఇన్కు అనుమతి లేదంటూ కువైట్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ విధమైన ఆంక్షలు విధించడంతో ఓ రెస్టారెంట్ వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం వినూత్నరీతిలో ఆలోచించి ప్రభుత్వం జారీ చేసిన అనుమతులను అతిక్రమించకుండా ఎంతో చాకచక్యంగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు.
రెస్టారెంట్లలో ప్రభుత్వం డైన్-ఇన్కు అనుమతి ఇవ్వకపోయినా డెలివరీ సర్వీసులకు అనుమతి ఉండడంతో ఆ రెస్టారెంట్ యజమాన్యం కార్-ఇన్ సర్వీసును ప్రారంభించాలనే సరికొత్త ఆలోచన చేసింది.ఆ ఆలోచన రావడమే ఆలస్యం దానిని ఆచరణలో పెట్టి వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు.
కార్-ఇన్ సర్వీసు అంటే రెస్టారెంట్ల ముందు కారు వచ్చి ఆపితే చాలు కస్టమర్లకు కావలసిన ఆహార పదార్థాలు అన్ని కారులో కూర్చుని ఆర్డర్ చేస్తే చాలు రెస్టారెంట్ యాజమాన్యం వారికి సర్వీస్ చేస్తారు.కస్టమర్లు కూడా కరోనా ఎక్కువగా ఉండటం వల్ల కార్లో కూర్చుని తినడానికి ఇష్టపడుతున్నారు.హోటల్ యాజమాన్యం చేసిన వినూత్నమైన ఆలోచన వల్ల వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో ఇదే ఆలోచనలో మరిన్ని రెస్టారెంట్ కూడా కార్_ ఇన్ సర్వీసులను ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నారు.