పానీ పూరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ పానీ పూరీ తినేందుకు ఇష్టపడుతారు.
సాయంత్రం అయిందంటే చాలు పానీ పూరీ బండ్ల దగ్గర విపరీతమైన జనాలు కనిపిస్తారు.మరి ఇంతలా జనాలు ఇష్టపడే పానీ పూరికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
దాన్ని చూసిన వారంతా కూడా ఇదేం పానీ పూరీ అంటూ షాక్ అవుతున్నారు.మనకు తెలిసినంత వరకు పానీ పూరీని కాస్తంత పప్పు వేసి ఓ నీటిలో ముంచి ఇస్తుంటారు.
దాన్ని మనం ఆవురావురు మంటూ తినేస్తాం.ఇదే కదా మనందరికీ తెలిసిన పానీపూరీ.
అయితే మీరెప్పుడైనా పానీపూరీలో మంటలు వెలగడం చూశారా.అదేంటి పానీపూరీలో మంటలు ఎలా వెలుగుతాయి అని షాక్ అయిపోకండి.
మారుతున్న కాలానికి తగ్గట్టు అనేక రకాల వంటకాలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే కదా.ఇప్పుడు కూడా ఇలాంటి వంటకమే ఒకటి నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతుంది.
ఈ వైరల్ వీడియోలో ఓ అమ్మాయి పానీ పూరీ తినేందుకు పానీ పూరి బండి దగ్గరకు వస్తుంది.అయితే అప్పుడు ఆమెకు ఓ పానీపూరిని అతగాడు ఇస్తాడు.
అయితే ఈ పానీపూరిలో మంట వెలుగుతుంది.దాన్ని ఆ పానీ పూరీ బండి యజమాని పెట్టి ఇస్తాడు.అయితే ఆ మంటలు వెలుగుతుండగానే ఆ పానీపూరిని ఆ యువతి తినేయడం మనం చూడొచ్చు.దీన్ని కొందరు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది.
దాన్ని చూసిన వారంతా కూడా ఇదేం పానీపూరిరా బాబు అంటూ షాక్ అవుతున్నారు.ఇంకొందరు అయితే ఇలాంటివి అలవాటు లేకుండా తింటే ప్రాణాలకే ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు.
ఇలా ఈ వైరల్ వీడియో మీద ఒక్కొక్కరు ఒక్కో విధగా స్పందిస్తున్నారు.