అమెరికా పై ప్రకృతి పగబట్టిందా అనిపిస్తోంది తాజా పరిస్థితులని గమనిస్తుంటే.2019 లో మొదలైన కరోనా వైరస్ పుట్టింది చైనాలో అయినా దాని ప్రభావం మాత్రం అమెరికాపై పూర్తి స్థాయిలో చూపిస్తోంది.ప్రపంచంలో కరోనా కేసుల భాదితులు , మృతులు అమెరికాలో అత్యధికంగా ఉన్నారు.ఇదిలాఉంటే తాజాగా ప్రకృతి కోపించిందో లేదా మానవ తప్పిదమో ఏమో కనీ కాలిఫోర్నియా అడువుల్లో కారు చిచ్చు రగులుకుంది.
సహజంగానే అమెరికా టొర్నాడో లు, వరదలకి అలవాటు పడిపోయింది.తాజాగా ఈ ప్రకృతి బీభత్సం తో ఆందోళన చెందుతోంది.
అమెరికాలోని కాలిఫోర్నియా లో ఉన్న దట్టమైన అడవులలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.అగువా డల్సే ప్రాంతంలో చేరరేగిన ఈ మంటలు అడవిని వేగంగా దహించుకు పోతున్నాయి.
ఒక్క సారిగా ఉద్రుతమైన ఈ మంటలని చల్లార్చడానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే లాస్ ఏంజిల్స్ మోజావే ఎడారిని కలిపే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.
ఈ అడవికి దగ్గరలో నివసిస్తున్న ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించారు.
ఎగసి పడుతున్న మంటలని ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది హెలికాఫ్టర్ ల సాయంతో ప్రయత్నాలు ముమ్మరం చేసింది.సుమారు 5,400 ఎకరాల అడవి ఈ కారు చిచ్చులో కాలి బూడిద అయిపోయిందని అధికారులు తెలిపారు.రహదారిని మూయడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
ఇదిలాఉంటే గతంలో ఆస్ట్రేలియాలో ఇలాంటి కారు చిచ్చు రగలడంతో కొన్ని వేల ఎకరాల భూమి కాలిపోగా లక్షలాది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయాయి.