రాజకీయాల నుంచి తప్పుకున్న సిరిసిల్ల రాజయ్య

తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ ఎంపీ, వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ప్రకటించారు.ఇందుకు కారణం ఆయన కోడలు తన ముగ్గురు పిల్లలతో కలిసి అగ్నికి ఆహుతి కావడమే.

 Fire Kills Four Of Sircilla Rajaiah’s Family Members-TeluguStop.com

ఈ రోజు తెల్లవారు జామున వరంగల్లో ఈ దారుణ ఘటన జరిగింది.తెలంగాణలో సంచలనం కలిగించింది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాజయ్య కుటుంబంలో ఇలా జరగడంతో ఈ పార్టీ రాజకీయంగా ఇరుకున పడింది.నామినేషన్లకు ఈ రోజు చివరి రోజు కావడంతో గడువు ముగిసేలోగా మరో అభ్యర్థిని ఎంపిక చేయాలి ప్రస్తుతం అందుకోసం వెతుకుతున్నారు.

కానీ ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనబడటం లేదు.దీంతో కాంగ్రెస్ నాయకులకు తీవ్ర ఆందోళనగా ఉంది.

రాజయ్య మహా విషాదంలో ఉన్నాడు.కుటుంబ కలహాల కారణంగా కోడలు సారిక తన ముగ్గురు పిల్లలతో చాలా కాలంగా విడిగా ఉంటోంది.

కొడుకు రాజయ్య ఇంటిలో ఉంటున్నాడు.నిన్న కూడా రాజయ్యకు, కోడలికి గొడవ జరిగినట్లు సమాచారం.

అయితే సారిక ఇంటిలో జరిగింది ప్రమాదమా? ఆత్మహత్యా? హత్యా? అనేది ఇప్పటివరకు తెలియదు.ఈ మూడు కొనాల నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాజయ్య కుటుంబ కలహాల సంగతి కాంగ్రెస్ నాయకులకు తెలుసు.అయినా జిల్లాకు చెందిన వాడు కావడంతో టిక్కెటు ఇచ్చారు.

మొత్తం మీద వరంగల్లో కాంగ్రెస్ చిక్కుల్లో పడింది.ప్రస్తుతం ఆ పార్టీ నాయకులకు గెలుపు మీద ఆశలు లేవని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube