టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్యపాత్రలో రామాయణం ఆధారంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆదిపురుష్’.ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతుండగా, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
టీ సిరీస్ బ్యానర్ భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్లతో పాటు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.కాగా ఈ మూవీ కోసం ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో భారీ సెట్ వేశారు.
అయితే షూటింగ్ మొదటి రోజునే ఈ సెట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని తెలుస్తోంది.
ఇకపోతే ఇక్కడ చెలరేగిన మంటలను అదుపుచేయడానికి 8 ఫైర్ ఇంజిన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగాయి.కానీ ఈ లోపలే సెట్ మొత్తం ధ్వంసం అయినట్లు తెలుస్తుంది.
అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారని చిత్ర యూనిట్కు చెందిన వారు వెల్లడించారు.