కొవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. సజీవ దహనం అయిన రోగులు.. !

గత సంవత్సరం దేశంలోకి ఒంటరిగా వచ్చిన కరోనా భారత్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.కానీ కరోనా సెకండ్ వేవ్‌గా వస్తూ వస్తూ అగ్నిదేవుణ్ని తోడుగా తెచ్చుకుంది కావచ్చూ.

 Fire At Covid Hospital In Gujarat Bharuch Patients Burnt Alive , Gujarat, Bharuc-TeluguStop.com

అందుకే ఎక్కువగా కోవిడ్ పేషెంట్లు ట్రీట్‌మెంట్ పొందుతున్న అస్పత్రుల్లో తిష్ట వేసింది.అగ్నిప్రమాదాలతో వారి ప్రాణాలను తీస్తుంది.

ఇప్పటికే తరచుగా ఆస్పత్రుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కరోనా రోగులను ఆందోళనకు గురిచేస్తుండగా, తాజాగా మరో ఘోర ప్రమాదం గుజరాత్‌లోని భరూచ్ నగరంలో చోటు చేసుకుంది.స్దానికంగా ఉన్న వెల్ఫేర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారుగా ఒంటి గంట సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది రోగులు సజీవ దహనమయ్యారని సమాచారం.

కాగా ఈ ఆసుపత్రిలో మొత్తం 50 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వారిలో 24 మంది ఐసీయూ లో చికిత్స తీసుకుంటున్నారట.అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భరూచ్ ఎస్పీ తెలిపారు.

ఇక ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube