గత సంవత్సరం దేశంలోకి ఒంటరిగా వచ్చిన కరోనా భారత్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.కానీ కరోనా సెకండ్ వేవ్గా వస్తూ వస్తూ అగ్నిదేవుణ్ని తోడుగా తెచ్చుకుంది కావచ్చూ.
అందుకే ఎక్కువగా కోవిడ్ పేషెంట్లు ట్రీట్మెంట్ పొందుతున్న అస్పత్రుల్లో తిష్ట వేసింది.అగ్నిప్రమాదాలతో వారి ప్రాణాలను తీస్తుంది.
ఇప్పటికే తరచుగా ఆస్పత్రుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కరోనా రోగులను ఆందోళనకు గురిచేస్తుండగా, తాజాగా మరో ఘోర ప్రమాదం గుజరాత్లోని భరూచ్ నగరంలో చోటు చేసుకుంది.స్దానికంగా ఉన్న వెల్ఫేర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారుగా ఒంటి గంట సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది రోగులు సజీవ దహనమయ్యారని సమాచారం.
కాగా ఈ ఆసుపత్రిలో మొత్తం 50 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వారిలో 24 మంది ఐసీయూ లో చికిత్స తీసుకుంటున్నారట.అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భరూచ్ ఎస్పీ తెలిపారు.
ఇక ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.