దేశాన్ని కరోనా పట్టి పీడిస్తున్న సమయం లో రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు కూడా ముప్పేట దాడి చేస్తున్న విషయం తెలిసిందే.ఇదే కాకుండా కోవిడ్ హస్పటల్స్ కూడా అగ్ని ప్రమాదాల బారిన పడగా ఎందరో పేషెంట్స్ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇలాంటి ప్రమాదమే ప్రస్తుతం మహారాష్ట్ర లోని నాగ్పూర్లో చోటు చేసుకుంది.నాగ్పూర్లోని కొవిడ్ హాస్పిటల్లో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగడంతో నలుగురు మృత్యువాత పడ్డారని అధికారులు వెల్లడిస్తున్నారు.
కాగా ఈ ప్రమాద సమయంలో హాస్పిటల్లో ఉన్న 27 మంది రోగులను మరో దవాఖానకు తరలించినట్లు, ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా ఓ పోలీస్ అధికారి తెలిపారట.
ఇకపోతే నాగ్పూర్ వాడి పరిసరాల్లోని ప్రైవేటు ఆసుపత్రిలో 30 పడకలు ఉండగా, ఇందులో 15 ఐసీయూ పడకలు ఉన్నాయట.
అయితే రెండో అంతస్థులో ఐసీయూ లోని ఏసీ యూనిట్ నుంచి రాజుకున్న మంటలు వేగంగా వార్డు మొత్తం వ్యాపించాయి.అయితే ఆ
.