పూణెలో శానిటైజర్ తయారు చేసే కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.శానిటైజర్ చేసే ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు వచ్చాయి.
ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది మృత్యువాత పడ్డారని సమాచారం.ఆ కంపెనీలో ప్రమాదం జరిగే టైం లో మొత్తం 37 మంది ఉన్నట్టు తెలుస్తుంది.
మంటలు ఎలా వచ్చాయో వివరాలు తెలియాల్సి ఉంది.అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో భారీ ఎత్తున మంటలు వచ్చాయి.
ప్రమాదంలో మరికొంతమంది కార్మీకులు గల్లంతైనట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నారు.మంటలు రావడంతో అక్కడకు భారీగా ఫైర్ ఇంజిన్లు వచ్చాయి.
మంటల్ని ఆర్పడం కోసం ఫైర్ ఇంజిన్ సిబ్బంది కష్టపడ్డారు.సహాయక సిబ్బంది సైతం మంటలను ఆర్పేందుకు కృషి చేశారు.
అయితే సంఘటన అసలు ఎలా జరిగిందన్న దాని మీద వివరాలు బయటకు రావాల్సి ఉంది.షార్ట్ సర్క్యూట్ వల్లే కంపెనీలో మంటలు వచ్చాయాన్నట్టుగా చెబుతున్నారు.మాములుగా శానిటైగర్ కు ఫైర్ యాడ్ అయితే బ్లాస్ట్ అవుతుంది.అలాంటిది శానిటైగర్ కంపెనీలో అగ్ని ప్రమాదం అంటే ఆ బ్లాస్ట్ భారీగా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే పూర్తి డీటైల్స్ మాత్రం అధికారులు వెల్లడించాల్సి ఉంది.