బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్ ప్రముఖ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న‘కౌన్ బనేగా కరోడ్ పతి’కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న విషయం తెలిసినదే.అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం మరో వివాదంలో చిక్కుకుంది.
ఈ కార్యక్రమంలో అమితాబచ్చన్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రశ్నలు అడిగారు అంటూ లక్నోకు చెందిన ఓ వ్యక్తి ఈ కార్యక్రమం పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గత శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్ లో సామాజికవేత్త బెజవాడ విల్సన్, నటుడు అనూప్ సోనీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఎపిసోడ్ లో మొదటి నుంచి ప్రశ్నలు అడుగుతున్న అమితాబచ్చన్ కు ఎంతో చాకచక్యంగా సమాధానాలు చెబుతూ వచ్చారు.
ఇందులో భాగంగానే వీరిని రూ.6,40,000 ప్రైజ్మనీ ప్రశ్న అడిగారు.1927 డిసెంబర్ 25 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఆయన అనుచరులు ఏ గ్రంథ పత్రాలను తగులబెట్టారు అని అడిగారు.ఆ ప్రశ్నకు సమాధానాలు గా ఏ) విష్ణు పురాణం బీ) భగవద్గీత సి) రిగ్వేద డి) మనుస్మృతి అని ఆప్షన్ లను ఇచ్చారు.
దీంతో ఆ కంటెస్టెంట్ ఎంతో అలవోకగా వారి సమాధానాన్ని కరెక్ట్ గా తెలియజేశారు.అయితే ఈ ప్రశ్న పై అమితాబచ్చన్ మాట్లాడుతూ కుల ‘వివక్ష, అస్పృశ్యతను పెంపొందించేలా ఉందనే కారణంతో మనుస్మృతిని’అంబేద్కర్ అతని అనుచరులు తగులబెట్టారని తెలియజేశారు.
దీంతో పలువురు నెటిజన్లు ఈ ప్రశ్నపై స్పందిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అమితాబచ్చన్ మాట్లాడారని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.అంతేకాకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మరికొందరు ట్వీట్ కూడా చేస్తున్నారు.
ఈ సంఘటనపై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’నీ కమ్యూనిస్టులు హైజాక్ చేశారంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.