టీడీపీ అధినేత చంద్రబాబు పై మోరోసారి విమర్శల వర్షం కురిపించారు వైసీపీ నాయకులు.ఇప్పటికే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో అవినీతికి పాల్పడుతోందని తరుచుగా చంద్రబాబు విమర్శలు చేస్తుండడంపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఫైర్ అయ్యారు.
.తక్కువ ధరకే కాంట్రాక్టులు అప్పగిస్తుంటే టీడీపీ నేతలకు చంద్రబాబుకు కలిగే బాధ ఏంటి అంటూ ప్రశ్నించారు బుగ్గన.
టీడీపీ హయాంలో ఎక్కువ ధరకు టెండర్ వేసిన వాళ్లే తక్కువ ధరకు పనులు చేస్తాం అంటూ వస్తున్నారని చంద్రబాబు గతంలో ప్రశంసించిన కంపెనీలకే కదా కాంట్రాక్టులు ఇచ్చేది అయినా డబ్బు ఆదా అవుతుంటే మంచిదేకదా చంద్రబాబు ఎందుకు ఇంతగా బాధపడిపోతున్నాడో అర్ధం కావడంలేదు అంటూ బుగ్గన విమర్శలు చేశారు.