రెండో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా చాలా మంది ప్రముఖులు మరియు రాజకీయ నేతలు టీకా వేయించుకుంటున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ వసంత కుంజ్ లోని ఫోర్టిస్ హాస్పిటల్లో తొలి డోస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె షాకింగ్ కామెంట్ చేశారు.భారతదేశంలో ఉండటం గర్వించదగ్గ విషయం అంటూ వ్యాఖ్యానించారు.
అదేవిధంగా తనకీ వ్యాక్సిన్ వేసిన నర్స్ రమ్య కి థాంక్స్ అని తెలిపారు.సరైన సమయంలో సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటం మరియు పంపిణీ చేసే విధంగా ఉండటం అటువంటి దేశంలో పుట్టటం తన అదృష్టం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నేతలు వేయించుకుంటూ ఉండటంతో.వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం చాలా శరవేగంగా సాగుతోంది.పైగా రోజు లో ఎలాంటి సమయంలో అయినా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలపటంతో పంపిణీ కార్యక్రమం భారీ స్థాయిలో జరుగుతుంది.కరోనా వ్యాక్సిన్ పంపిణీ లపై పూర్తిగా ఆంక్షల తొలగించడంతో .వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం వేగవంతం అయ్యింది