టాలీవుడ్ బాపు బొమ్మ నటి కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను దోచుకుంది.
తన అందం తగ్గటు తను కూడా ఎంత హోమ్లీ గా కనిపిస్తుంది.తను మోడలింగ్ రంగం నుండి మంచి గుర్తింపు పొంది ఆ తర్వాతే సినిమా పరిశ్రమకు పరిచయమైంది.
ఇక ఆమె సినిమాలలో ఎంచుకునే పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి.ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
2000 లో బాలనటిగా మొదటిసారి మలయాళం పైలెట్స్ సినిమా ద్వారా వెండితెర లో అడుగు పెట్టగా.తరువాత తమిళ సినిమాలలో నటించింది.
ఇక 2016లో నేను శైలజ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఆమె నటించిన మహానటి సావిత్రి పాత్ర ఎంత ఆకట్టుకుందో చెప్పనవసరమే లేదు.
ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో లీనమైపోయింది.ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా బానే ముందుంటుంది కీర్తి.
తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.ఇప్పటివరకు కీర్తి సురేష్ లుక్ ఎంతో హోమ్లీగా ఉండేది.అంతేకాకుండా ఎక్కువ ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తుండేది.
కానీ తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేయగా వైరల్ గా మారాయి.అందులో కీర్తి లుక్ కాస్త గ్లామర్ గా కనిపిస్తుంది.
ఇప్పటివరకు ఎటువంటి ఎక్స్ పోజ్ చేయకపోయినా.ప్రస్తుతం ఈ ఫోటోలో కీర్తి సురేష్ హాట్ లుక్ తో, గ్లామర్ ఫోజ్ తో.నేను కూడా తక్కువేమికాదనట్లూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఇక కీర్తి సురేష్ తమిళంలో అన్నాత్తే సినిమాలో నటిస్తుంది.
ఇక మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో ప్రస్తుతం బిజీగా ఉంది.