బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే.దీంతో మొదట అతని మృతిపై ఎలాంటి అనుమానాలు లేకపోయినప్పటికీ ఆతర్వాత అతని బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు మాయం అవ్వడం, అలాగే అతను చనిపోయిన సమయంలో అతని ఫోటోలను చూపించి కొట్టి చంపారు అని వీడియోలు వైరల్ అయ్యాయి.
అయితే సుశాంత్ మృతి విషయంలో ఎలాంటి కుట్ర కోణం లేదని ఫోరెన్సిక్ పరీక్షల తుది నివేదికలు పేర్కొన్నాయి.టాక్సికాలజీ, గోళ్ల నమూనాలు రిపోర్ట్స్ తో పాటు ఫోరెన్సిక్ తుది నివేదికలను ముంబై పోలీసులు ఈరోజు సుప్రీం కోర్టుకు సమర్పించారు.
సుశాంత్ సింగ్ పై ఎలాంటి విష ప్రయోగం జరగలేదని ఆ నివేదికలో స్పష్టం చేశారు.
అంతేకాదు సుశాంత్ సింగ్ మరణించే సమయంలో ఎలాంటి పెనుగులాట జరగలేదని, అతను తానుగా విషం సేవించలేదు, విషప్రయోగం జరగలేదని నివేదికలు స్పష్టం చేశాయి.అంతేకాదు సుశాంత్ కు ఎలాంటి గాయాలు కాలేదు అని అతను ఊపిరి ఆడకనే మృతి చెందునట్టు పోస్టుమార్టం నివేదకలోను స్పష్టం అయ్యాయి. ముంబై పోలీసులు ఫోరెన్సిక్ బృందం సభ్యులను విచారించగా ఎటువంటి సంచలన విషయాలు బయటపడలేదని పోలీసులు తెలిపారు.
కాగా ప్రస్తుతం సుశాంత్ మృతి కేసుపై సీబీఐ విచారణ జరుగుతుంది.