బాలీవుడ్ దృశ్యం దర్శకుడు పరిస్థితి విషమం... హైదరాబాద్ లో చికిత్స

ఈ ఏడాది బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ ఏడాది రకరకాల కారణాలతో చనిపోయారు.

 Filmmaker Nishikant Kamat Is Critical But Stable, Bollywood, Health Situation, H-TeluguStop.com

అందులో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది.ఆయన మరణం ఒక మిస్టరీగా మారిపోయింది.

మరో వైపు కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ ఊపిరితిత్తులు క్యాన్సర్ తో అత్యవసర చికిత్స తీసుకోవడానికి అమెరికా వెళ్తున్నారు.ఈ ఘటన కూడా కాస్తా బాలీవుడ్ లో విషాదకర పరిణామమే అని చెప్పాలి.

కొద్ది రోజుల క్రితం అమితాబచ్చన్ ఫ్యామిలీ కరోనా బారిన పడి కోలుకున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నిషికాంత్‌ కామత్‌ చావుబ్రతుకుల మధ్య ఉన్నారు.

డోంబివాలీ ఫాస్ట్‌ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు పొందారు.గత కొన్ని రోజులుగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఆయన ఐసియులో ఉన్నారు.మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ దృశ్యం హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించింది నిషికాంతే.

ముంబై మేరీ జాన్‌, ఫోర్స్‌, లై భారీ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.అలాగే నటుడుగా కూడా గుర్తింపు పొందారు.

బాలీవుడ్‌ మూవీ హవా ఆనే దే, మరాఠీ సినిమా సాచ్య ఆట ఘరాట్‌ సినిమాల్లో నటించారు.బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహాం నటించిన రాకీ హ్యాండ్సమ్‌ సినిమాలో విలన్‌ గా నటించి మెప్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube