ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు హఠత్మరణం చెందుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఓ వైపు యువ నటులు ఆత్మహత్యలు మరో వైపు సీనియర్ నటులు, దర్శక, నిర్మాతల మరణం చిత్ర పరిశ్రమని టెన్సన్ పెడుతుంది.
రీసెంట్ గా టాలీవుడ్ లో ప్రముఖ నటుడు దీక్షితులు గుండెపోటుతో మరణించిన సంగతి అందరికి తెలిసిందే.ఇదిలా వుంటే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, క్లాసిక్ చిత్రాల నిర్మాతగా పేరొందిన రాజ్ కుమార్ బార్జాత్య మృతి చెందారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.
రాజశ్రీ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ కుమార్ బార్జత్యా కుటుంబ కథా చిత్రాలని బాలీవుడ్ లో ఎక్కువగా నిర్మించి తనకంటూ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ అంటే బాలీవుడ్ లో రాజశ్రీ ప్రొడక్షన్, రాజ్ కుమార్, అతని కుమారుడు సూరజ్ బర్జత్య అందరికి గుర్తుకొస్తారు.ప్రస్తుతం రాజశ్రీ ప్రొడక్షన్ బాద్యతలని రాజ్ కుమార్ బార్జాత్యా కుమారుడు సూరజ్ బార్జాత్యా చూసుకుంటూ వున్నారు.
ఇదిలా వుంగే కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన ఆయన ఈ రోజు మరణించినట్లు తెలుస్తుంది.ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
ఆయనకి నివాళి అర్పించి, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.