సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు సర్వసాధారణం.కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండటం సర్వసాధారణం.
ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు చాలా గ్యాప్ తర్వాత సినిమాలు తీసి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించారు.ఇలా హిట్ తర్వాత ఎన్నో ఫ్లాపులను చవిచూసిన డైరెక్టర్లు మరోసారి వారి అదృష్టాన్ని పరీక్షించుకునీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించారు.
మరి ఆ డైరెక్టర్లు ఎవరు అనే విషయానికి వస్తే…
బొమ్మరిల్లు భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకొని ఏకంగా సినిమా పేరే తన పేరుగా మారిపోయింది.
బొమ్మరిల్లు తర్వాత ఎలాంటి హిట్ లేక సతమతమవుతున్న భాస్కర్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అద్భుతమైన విజయాన్ని అందించింది.కొత్త బంగారులోకం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఫ్యామిలీ చిత్రాలను తెరకెక్కించారు.
కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల నారప్ప చిత్రం ద్వారా మరోసారి విజయం సాధించారు.
గోపీచంద్ మలినేని ఈ ఏడాది క్రాక్ సినిమా ద్వారా సూపర్ హిట్ సాధించి ప్రస్తుతం బాలకృష్ణతో మరో సినిమా లైన్ లో పెట్టారు.
ఏమైంది ఈ వేళ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన దర్శకుడు సంపత్ నంది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ హీరోగా సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా తర్వాత పెద్దగా విషయాలను అందుకోని సంపత్ నంది ఈ ఏడాది గోపీచంద్ సిటిమార్ చిత్రంతో మరోసారి విజయం సాధించారు.పిట్టగోడ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన అనుదీప్ ఈ ఏడాది జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఇలా ఫ్లాపుల తర్వాత ఈ దర్శకులు మంచి విజయాలను అందుకున్నారని చెప్పవచ్చు.