హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.ఈ పీసీకి టాప్ లీగ్ నిర్మాతలు హాజరుకానున్నారు.
అదేవిధంగా షూటింగ్స్ పునః ప్రారంభంపై కీలక నిర్ణయాన్ని ఛాంబర్ ప్రకటించే అవకాశం ఉంది.మరోవైపు నిర్మాణ వ్యయం తగ్గించాలనే నిర్మాతల లక్ష్యం నెరవేరినట్లు సమాచారం.
దీనిలో భాగంగా ఈనెల 22 నుంచి షూటింగ్స్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 1 నుంచి కొత్త చిత్రాలు ప్రారంభంకానుండగా, ఈనెల 25 నుంచి టాప్ హీరోల చిత్రాలు సైతం పట్టాలెక్కనున్నాయి.