కొడుకులతో పోటీ పడుతున్నకింగ్ నాగార్జున

అక్కినేని నాగార్జున తన కొడుకులని హీరోలుగా పరిచయం చేసి వారిని స్టార్స్ గా నిలబెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా అఖిల్ మీద మరింత ఎక్కువ ఫోకస్ పెట్టాడు.

 Fighting Between King Nagarjuna And His Sons-TeluguStop.com

అదే సమయంలో తను కూడా హీరోగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు.అయితే తనకి వచ్చే స్థాయిలో కూడా స్టార్ ఇమేజ్ కొడుకులు రావడం లేదనే బాధ కింగ్ ని వెంటాడుతుంది.

అయితే చైతూ బాద్యత మొత్తం సమంత తీసుకోవడంతో అఖిల్ సినిమాల విషయంలో మరింత కేర్ ఫుల్ గ నాగ్ వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సారి ఊహించని విధంగా తండ్రి కొడుకులు ముగ్గురు ఒకేసారి పోటీ పడుతున్నారు.

దీంతో వీళ్ళ మధ్యలో విజయం ఎవరిని వరిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్ బ్లాస్ట్స్ నేపధ్యంలో వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.అలాగే అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చేసింది.

దీంతో పాటు చైతూ-సాయి పల్లవి జోడీగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ సినిమా కూడా షూటింగ్ చివరి దశలో ఉంది.అయితే ఇవన్ని కూడా కరోనా కారణంగా వాయిదా పడటంతో మూడు సినిమాలకి సంబందించిన నిర్మాతలు వీటిని జులైలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని భావిస్తున్నారు.

అదే జరిగితే నాగార్జున, చైతూ, అఖిల్ మధ్య పోటీ తప్పదు.మరి ఈ పోటీలో తండ్రిని కొడుకులు ఇద్దరు ఎలా ఎదుర్కొంటారు.

ఎవరికీ విజయం వరిస్తుంది అనేది ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube