ఎయిర్ ఇండియా విమానం కాక్ పిట్లో పైలట్ మరియు ఇంజనీర్లు కొట్టాడుకున్నారు.చెన్నై` ప్యారిస్ విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
విమానం బయలు జేరడానికి కొంత సమయం ముందు ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది.పైలట్ ఇంజనీర్పై విచక్షణ రహితంగా దాడి చేసినట్లుగా సమాచారం అందుతోంది.
ఆ తర్వాత పైలట్ తనకు తానుగా కాక్ పిట్లో బంధించుకున్నాడు.
వీరి గొడవతో విమానం బయలుజేరేందుకు రెండు గంటలు ఆలస్యం అయ్యింది.
దాంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొవాల్సి వచ్చింది.ఇంజనీర్పై దాడి చేసిన పైలట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం వీరిద్దరు కూడా చికిత్స నిమిత్తం హాస్పిటల్లో ఉన్నారు.త్వరలో వీరిద్దరిని విచారించి, దోషులను కఠినంగా శిక్షిస్తామని ఎయిర్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది.
విమానంలో గొడవ విషయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉంది.