ఎయిర్ ఇండియా విమానం పైలట్లు ఒకరిని ఒకరు చేయిచేసుకున్న ఘటన జైపూర్ లో ఆదివారం చోటు చేసుకున్న సంగతి లోకవిదితమే .జైపూర్ నుంచి ఢిల్లీకి విమానం బయలుదేరే ముందు కాక్ పిట్ లో కెప్టెన్, కో- పైలట్ ఘర్షణ పది చేతులు కలిపేసారు.
అసలు ఈ గొడవకు కారణం కెప్టెన్ తన కో పైలట్ ను అంకుల్ అని పిలిచి తాపులు తిన్నాడు.విమానం టేక్ ఆఫ్ కు ముందు కెప్టెన్ అంకుల్ అని పిలవడంతో గొడవకు దారి తీసింది.
సీనియర్ పైలట్ అయిన కెప్టెన్ యువకుడు కావడంతో కో-పైలట్ ను అంకుల్ అని ఉచ్చరించాడు.దీంతో కో పైలట్ విభేదించి కెప్టెన్ తో ఘర్షణకు దిగాడు.
తనను అంకుల్ అనడానికి నువ్వు ఎవరు? అని కో పైలట్ ప్రశ్నించాడు.అంతటితో ఆగకుండా కెప్టెన్ ను అరె నీ తల్లి అని దూషించాడు కో-పైలట్ దాడి ఎదురుదాడి చేసుకున్నారు .దీనిపై తమకు ఫిర్యాదు అందిందని త్వరలోనే ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని అధికారి ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.మేటర్ సీరియెస్ తీసుకున్నామని పై అధికార్లు చెప్పారు.