సెప్టెంబర్ 6న కింగ్ నాగార్జున హోస్ట్గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 4 ప్రస్తుతం మూడు వారాలు కంప్లీట్ చేసుకుని.నాల్గువ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ముగ్గురు ఇంటి నుంచి ఎలిమినేట్ కాగా.మరో ముగ్గరు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
అయితే నాల్గువ వారంలోకి వచ్చే సరికి.బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ మంచి ఫామ్లోకి వచ్చారని చెప్పాలి.
ముఖ్యంగా టాస్కుల్లో విశ్వరూపం చూపిస్తూ.తమ స్వభావాన్ని బయట పెడుతున్నారు.
అయితే మునపెన్నడూ లేని విధంగా ఈవారం నామినషన్ సరికొత్తగా ఉంటుందని ప్రేక్షకులు భావించారు.ఇందుకు కారణం.
ముందుగా విడుదల చేసిన ప్రోమోలే.ఎందుకంటే.
మొన్న విడుదల చేసిన ప్రోమోలో ఎప్పుడు సైలెంట్గా ఉండే నోయెల్, లాస్య ఓ రేంజ్లో అరుచుకుంటూ రచ్చ చేశారు.నా గురించి ఏదో అన్నావంట అంటూ నోయల్ నిలదీయడంతో లాస్య ఫైర్ అయింది.
నువ్వు ఎందుకు అరుస్తున్నావ్.అంటే నువ్వు ఎందుకు ఆరుస్తున్నావని ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ టాప్ లేపేసినట్టు ప్రోమోలో చూపించారు.
దీంతో ప్రేక్షకుల్లో అసలు వీరి మధ్య ఏం జరిగింది అనే కుతూహలం మొదటైంది.ఇక నిన్న జరిగిన ఎపిసోడ్లో లాస్య, నోయెల్ మధ్య ఎందుకు రచ్చ జరిగిందో చూపించి.
మొత్తం షో గాలి తీసేశాడు బిగ్ బాస్ నిర్వాహకులు.వాస్తవానికి ప్రోమోల్లో ఉన్నంత మసాలా అసలు ఎపిసోడ్లో ఉండటం లేదు.ఇప్పుడు కూడా అదే జరిగింది.
అసలు విషయం ఏంటంటే, మార్నింగ్ మస్తీలో భాగంగా.ఇంటి సభ్యులకు స్వాతి దీక్షిత్ నవరసాలు నేర్పించాలని బిగ్ బాస్ ఆదేశించాడు.ఇందులో మొదట స్వాతి అభిజిత్తో శృంగార రసాన్ని చేసి చూపించింది.
ఈ క్రమంలోనే కోపం రసాన్ని చూపించేందుకు లాస్య, నోయెల్లు రంగంలోకి దిగి ఓ రేంజ్లో పర్ఫామెన్స్ చేశారు.మ్యాటర్ లేకపోయినా.
ఇదే సీన్ని ప్రోమోలో చూపించి ప్రేక్షకులకు దిమ్మతిరిగేలా చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.