దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘంగా జరుగుతున్నా ఇండియా సార్వత్రిక ఎన్నికలు ఐదో విడతకి రంగం సిద్ధం అయ్యింది.ఐదో విడత ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ఆయా కేంద్రాలలో మొదలైంది.
ఇప్పటివరకు నాలుగు దశల్లో 373 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే.ఈ రోజు ఐదో విడతలో ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
ఈ ఐదో విడత ఎన్నికలలో అమేఠీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, స్మృతీ ఇరానీ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవగా, లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో శతృఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా తలపడుతున్నారు.అటు రాయ్బరేలీలో ఐదోసారి గెలుపు కోసం యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ.
బిహార్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం అయ్యింది.