ప్రపంచంలో చాలా మందికి ఫుట్బాల్ అంటే ఇష్టం.ఎక్కువ మంది ఇష్టపడే క్రీడ ఇదే.
ఇక ఫుట్ బాల్ క్రీడ విషయంలో ఫిఫా వరల్డ్ కప్-2022 అంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది.ఈ ఏడాది ఫుట్ బాల్ ప్రపంచ కప్ నిర్వహణను ఖతార్ దక్కించుకుంది.
ఈ ఫుట్బాల్ ఈవెంట్ నవంబర్ 21, 2022న ఖతార్లో ప్రారంభం కానుంది. ఫిఫా ప్రపంచకప్ను మిడిల్ ఈస్ట్లో నిర్వహించడం ఇదే తొలిసారి కాగా, రెండోసారి ఆసియా దేశాలు ఆతిథ్యమిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశం అత్యంత ఖరీదైన ప్రపంచకప్గా ఇది అవతరించనుంది.అయితే ఫిఫా వరల్డ్ కప్ కోసం ఖతార్ దేశం పెట్టిన ఖర్చు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.ఏకంగా 200 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.16.6 లక్షల కోట్లు దీనికి ఖర్చు చేసింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఫిఫా ప్రపంచ కప్కు ఆతిథ్యమిచ్చిన ప్రాంతంలోని అతి చిన్న దేశం ఖతార్.1954 FIFA ప్రపంచ కప్కు ఆతిథ్యమిచ్చిన స్విట్జర్లాండ్ తర్వాతి చిన్న దేశంగా నిలిచింది.దేశంలో 2.8 మిలియన్ల మంది నివాసితులు మాత్రమే ఉంటారు.ఖతార్ యార్క్షైర్ ప్రాంతం అంత పరిమాణంలో ఉంది.కానీ దేశం యొక్క పరిమాణం పక్కన పెడితే తలసరి ఆదాయంలో ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనదిగా కీర్తి గడించింది.
ఇక ఫిఫా వరల్డ్ కప నిర్వహణ కోసం ఇప్పటివరకు ఈ దేశం దాదాపు 200 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.ప్రపంచ కప్ ఫైనల్స్ను నిర్వహించడానికి వారు కొత్త నగరమైన లుసైల్ను నిర్మించారు.
నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, హోటళ్లు, విమానాశ్రయాలు మరియు అనేక కొత్త స్టేడియంల కోసం దేశం ప్రతి వారం $500 మిలియన్లు ఖర్చు చేస్తోంది.వేసవిలో దేశం యొక్క వేడి, తేమతో కూడిన పరిస్థితుల కారణంగా, ప్రపంచ కప్ 21 నవంబర్ 2022 మధ్య కేవలం 28 రోజుల వ్యవధిలో జరుగుతుంది మరియు క్రిస్మస్కు ఒక వారం ముందు అంటే డిసెంబర్ 18, 2022న ముగుస్తుంది. ఆ సమయంలో సగటు ఉష్ణోగ్రత 24°C ఉంటుంది.నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మధ్యలో ప్రపంచకప్ జరగడం ఇదే తొలిసారి.
FIFA ప్రపంచ కప్ ఎల్లప్పుడూ మే, జూన్ మరియు జూలైలలో వేసవి సీజన్లో నిర్వహిస్తారు.ఇక ఫిఫా వరల్డ్ కప్ కోసం నిర్వహించిన వేలంలో పోటీ తీవ్రంగా కొనసాగింది.
అనేక రౌండ్లలో జపాన్, USA మరియు దక్షిణ కొరియా వంటి దేశాలను ఓడించి ఖతార్ నిర్వహణ హక్కులను గెలుచుకుంది.రికార్డు స్థాయిలో ఖర్చు పెట్టి, ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది.