హుజూరాబాద్ ఉప ఎన్నికపై గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది.నేడు కౌంటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే అందరూ ఊహించినట్టే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిస్తోంది.
అయితే ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ అంచనాలు ఎంత వరకు అందుకుంటాయనేది ఇప్పుడు సందిగ్ధత నెలకొంది.అయితే దళిత బంధు పధకాన్ని ప్రారంభించిన శాలపల్లి చుట్టు ప్రక్కల గ్రామాలలో ఈటెల రాజేందర్ ఆధిక్యత చాటుతున్న పరిస్థితి ఉంది.
అయితే టీఆర్ఎస్ కు రోటీ మేకర్ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది.అచ్చం కారును పోలి ఉండేలా రోటీ మేకర్ గుర్తు ఉండడంతో కొన్ని ఓట్లు అటువైపు మళ్ళినట్లుగా అనిపిస్తోంది.
దీంతో టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు గుబులు పట్టుకుంది.అయితే రోటీ మేకర్ గుర్తు ఇప్పుడు బీజేపీకి లాభించేలా అనిపిస్తోంది.
అయితే రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో గెలుపు గుర్రం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.అయితే కౌంటింగ్ లో చివరికి ఏమి జరిగేది ఊహించడం కష్టం.
కాబట్టి ఎవరు గెలిచినిలుస్తారనే దానిపై ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది.అయితే బీజేపీ మాత్రం గెలుపుపై పెద్దగా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది.
అయితే పోలింగ్ జరిగిన రోజు నుండి బీజేపీ మాత్రం చాలా నమ్మకంగా ఉంది.కానీ టీఆర్ఎస్ మాత్రం చాలా సైలెంట్ గా ఉంటూ వస్తోంది.అయితే చివరి వరకు ఏదైనా జరగొచ్చే అనుమానం ఇరు పార్టీల్లో ఉంది.అయితే బీజేపీ పార్టీ మాత్రం ఏమి జరిగినా ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ కార్యకర్తల మధ్య చర్చ నడుస్తోంది.
చివరికి ఏమి జరుగుతుందనేది చూడాల్సి ఉంది.