తెలంగాణలో బీజేపీ భారీ వ్యూహాలతో రోజురోజుకు బలపడుతోంది.టీఆర్ఎస్ పై మాటలతూటాలు పేలుస్తూ క్షేత్ర స్థాయిలో పటిష్ట కార్యకర్తల నిర్మాణం చేపడుతూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే సంకేతాన్ని ప్రజలకు ఇస్తోంది బీజేపీ.
అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన బీజేపీ ఇతర పార్టీలలో ఉన్న బడా నాయకులకు బీజేపీ గాలం వేస్తోంది.ఇప్పటికే వివేక్, కూనం శ్రీశైలం గౌడ్ లాంటి కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే తెలంగాణ వ్యాప్తంగా విస్తరించుకోవాలనుకుంటున్న బీజేపీకి పాతబస్తీలో పాగా వేయడం అనేది బీజేపీ డ్రీమ్.కాని అక్కడ బీజేపీకి బలమైన నాయకత్వం లేకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అంతగా ప్రభావం చూపే పరిస్థితులలో లేకపోవడంతో పాతబస్తీలో బీజేపీ సత్తా చాటుకోలేకపోయింది.
అయితే పాత బస్తీలోబలమైన నేతగా పేరున్న కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తో బీజేపీలో చేరాలని చర్చలు జరుపుతున్నట్లు వార్త హల్ చల్ చేస్తోంది.దీనిపై ఇంకా ఎవరూ అధికారికంగా స్పందించకపోవడంతో వార్త నిజమా… కాదా అనేది కూడా నిర్ధారించుకోలేని పరిస్థితి ఉంది ఈ అనుమానానికి భవిష్యత్తులో సమాధానం దొరికే అవకాశం ఉంది.