సాధారణంగా కొందరు ముఖం తరచూ డ్రైగా మారిపోతూ ఉంటుంది.కేవలం వింటర్లోనే కాదు అన్ని సీజన్స్లోనూ ఇలా జరుగుతుంటుంది.
ఎన్ని సార్లు మాయిశ్చరైజర్లు రాసినా, ఎన్ని రకాల నూనెలు వాడినా మళ్లీ కొంత సమయానికి పొడిబారిపోతుంది.ఇలా తరచూ జరగడం వల్ల చాలా ఇరిటేషన్ గా ఫీల్ అవుతూ ఉంటారు.
ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలియక నానా ఇబ్బందులు పడుతుంటారు.
అయితే డ్రై స్కిన్ను నివారించడంలో మెంతి ఆకు అద్భుతంగా సహాయపడుతుంది.
మెంతి ఆకు ఆరోగ్యానికి ఎంత మంచిదో.చర్మానికి కూడా అంతే మేలు చేస్తుంది.
ముఖ్యంగా డ్రై స్కిన్ వారు మెంతి ఆకు వాడితే.బెస్ట్ రిజల్ట్స్ పొందొచ్చు.
మరి లేట్ చేయకుండా చర్మానికి మెంతి ఆకును ఎలా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు కొన్ని మెంతి ఆకులను తీసుకుని శ్రుభం చేసి మెత్తగా పేస్ట్ చేయాలి.ఇప్పుడు ఈ పేస్ట్లో కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకుని.ముఖానికి అప్లై చేయాలి.
పావు గంట లేదా ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తూ ఉంటూ ముఖం తరచూ డ్రైగా మారడం తగ్గుతుంది.అదే సమయంలో ఫేస్లో గ్లో పెరుగుతుంది.
లేదంటే మెంతి ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఆ పొడిలో కొద్దిగా నిమ్మ రసం, పుదీనా రసం వేసి బాగా కలుపు కోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమానికి ముఖాన్ని పూసి.ఇరవై లేదా ముప్పై నిమిషాలు పాటు వదిలేయాలి.
అనంతరం కొద్దిగా వాటర్ జల్లి వేళ్లతో మెల్ల మెల్లగా రుద్దుకుంటూ శుభ్రం చేసుకోవాలి.ఇలా డే బై డే చేస్తూ ఉంటే.
పొడిబారిడం తగ్గి ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.