అప్పుడప్పుడు తెలియకుండా చేసి చిన్న చిన్న పొరపాట్లు చాలా మంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతాయి.ముఖ్యంగా విమానంలో కాని, లేదంటే సముద్రంలో షిప్స్ లోగాని ప్రయాణం చేసే సమయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎ మాత్రం అజాగ్రత్తగా ఉండి, ఒకదానికి ఒకటి చేస్తే మొదటికె మోసం వస్తుంది.తాజాగ ఇంగ్లాండ్ లో ఓ మహిళా ప్రయాణికురాలు చేసిన పని ఒక్కసారిగా అందరిని కలవర పెట్టింది.
అయితే విమాన సిబ్బంది తక్షణం స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.అసలు విషయంలోకి వెళ్తే ఓ మహిళా ప్యాసెంజర్ టాయిలెట్ అనుకుని ఎమర్జెన్సీ డోర్ తీయడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు.
ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ నుంచి ఇస్లామాబాద్ వెళ్తున్ పీకే-702 విమానం రన్వేపైనే మీద నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో సడెన్ గా ఎమర్జన్సీ డోర్ తెరుచుకుంది.దీంతో వెంటనే అలెర్ట్ అయిన ఫైలెట్స్ విమానాన్ని ఆపేసి అందులో ప్రయాణిస్తున్న 37 మంది ప్యాసెంజర్లను వెంటనే కిందకు దించేసారు.
ఇక సదరు మహిళని ఈ పని ఎందుకు చేశావని అధికారులు ప్రశ్నించగా టాయిలెట్ అనుకుని తెరిచానని ఆమె సమాధానం చెప్పింది.విమాన సిబ్బంది అవగాహన పొరపాటు కారణంగా విమాన ఎయిర్బ్యాగ్ ప్యారాచూట్ కూడా ఓపెన్ అయింది.
మొత్తానికి ఆమె చేసిన పని వలన ఏకంగా 37 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.ఈ ఘటన తర్వాత విమానం తిరిగి బయలుదేరడానికి ఏడు గంటల సమయం పట్టింది.