ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో పొడిచిన శ్రీనివాస్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెల్సిందే.తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జగన్పై హత్య యత్నం జరిగింది.
అప్పుడే శ్రీనివాస్ను జైల్లో పెట్టారు.అప్పటి నుండి జగన్ విచారణ ఎదుర్కొంటూనే ఉన్నాడు.
జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోడికత్తి శ్రీను కేసు స్పీడ్ అవుతుందని అంతా అనుకున్నారు.కాని జగన్ వచ్చిన తర్వాత కూడా ఆ కేసు విషయంలో పెద్దగా చర్చలు జరగడం లేదు.
తాజాగా శ్రీను సోదరుడు పోలీసుల ముందుకు వచ్చాడు.జైలో ఉన్న తన సోదరుడు శ్రీనును కొందరు వేదిస్తున్నారని, జగన్పై హత్యయత్నం చేశావంటూ శ్రీనును కొట్టడం కూడా చేస్తున్నారంటూ శ్రీను సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
కేసు విచారణ పూర్తి కావడానికి కేరళ మరియు పశ్చిమ బెంగాళ్కు చెందిన దర్యాప్తు బృందంతో దర్యాపు చేయించాలంటూ ఆయన కోరాడు.ఈ కేసు విషయంలో ఎలాంటి పురోగతి రాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నాడు.