అమెరికా కాపిటల్ పై దాడి ఘటనపై యావత్ ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.ఓ దేశాధ్యక్షుడే ఏకంగా దాడికి ఉసిగొల్పేవిధంగా వ్యాఖ్యానించడం, ఆందోళన కారులను మరించగా రెచ్చగొట్టడం అమెరికా చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోనుంది.
అమెరికా కాపిటల్ కు ఇప్పటివరకూ ఇలాంటి ఘోరమైన అవమానం జరగలేదని అంటున్నారు రాజకీయవేత్తలు.ఈ ఘటనలో ఇప్పటి వరకూ చనిపోయిన సంఖ్య 5 కు చేరుకుంది.
కాగా కేంద్ర బలగాలు ఎంట్రీ ఇచ్చి ఆందోళన కారులను తరిమికొట్టిన తరువాత విచారణ చేపట్టిన పోలీసులు షాక్ అయ్యే సంఘటనలు అక్కడ కనిపించాయి.
ఆందోళన కారులు వెళ్ళిపోయినా తరువాత దర్యాప్తు బృందాలు వచ్చి కాపిటల్ భవనం మొత్తం పరీక్షిచాయి.
ఈ క్రమంలో అక్కడ వారికి పైప్ బాంబులు కనపడటంతో అధికారులు అందరూ అప్రమత్తం అయ్యారు.ప్రమాదకరమైన పైప్ బాంబులు అక్కడికి ఎవరు తీసుకువచ్చారు.ఆందోళన ముసుగులో అవాంచనీయ సంఘటనలు జరిపే కుట్రలు ఏమన్నా చేశారా అనే సందేహాలు వెలుబుచ్చారు అధికారులు.అసలు ఈ పైప్ బాంబులు ఎవరు అక్కడికి తీసుకువచ్చారు అనే అంశం పెద్ద చర్చకు దారితీసింది.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అణువణువు ఆధారాల కోసం గాలిస్తున్నారు.అయితే
ఈ కేసును చేధించే విషయంలో తలమునకలైన ఎఫ్ బీఐ నిందితులని పట్టుకోవడానికి అమెరికన్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ పైప్ బాంబులు ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చారో చెప్పిన వారికి భారీ బహుమతి ఉంటుందని ప్రకటిచింది.నిందితుల వివరాలు చెప్పిన వారికి 50 వేల డాలర్లు బహుమతిగా అందిస్తామని ప్రకటించింది.
ఈ కేసును వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రాధమిక ఆధారాలు సేకరించామని త్వరలో నిందితులను పట్టుకుంటామని ఎఫ్బీఐ ప్రకటించింది.అయితే ఈ కేసు విషయంలో అంత పెద్ద మొత్తం ప్రకటించడంపై అమెరికన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.