ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న చివరి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి.రెండోసారి అధికారంలోకి వచ్చాక కేవలం కొద్ది నెలలు కాలంలో ఆయన మరణించడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడం రాష్ట్ర విభజన జరగడం అందరికీ తెలిసిందే.
తెలుగు రాజకీయాలలో మరియు ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్న వై.యస్ అంటే చాలామంది అభిమానిస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఆయన ఎవరికైనా మాట ఇస్తే దాని పట్ల ఆయన ఎంత కట్టుబడి ఉంటారో అందరికీ తెలుసు.ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ జేబీపీ పార్టీకి చెందిన స్వామి గౌడ్ వైఎస్ అంటే తనకు ఎనలేని ప్రత్యేకమైన అభిమానం అని ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులు మరువలేనివని ఓ వెబ్ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
వైయస్ చనిపోయిన సమయంలో తన తండ్రి చనిపోయిన దాని కంటే ఎక్కువ బాధపడినట్లు తెలిపారు.అంతమాత్రమే కాకుండా ఆంధ్ర తెలంగాణ అనే బేధం లేకుండా ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకునే వారిని ఆ విషయంలో ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం టూ స్వామి గౌడ్ చెప్పుకొచ్చారు.
.