వేరే కులం యువకుడితో వెళ్లిందని గొంతు నులిమిన కన్న తండ్రి, వెలుగు చూసిన మరో పరువు హత్య!

పరువు హత్య ఘటనలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి.ఈ కాలంలో కూడా కులం మతం అంటూ అడ్డుగోడలు నిర్మించుకొని యువతీ యువకుల ప్రాణాలను బలితీసుకుంటున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

 Father Strangles 17 Years Old Daughter-TeluguStop.com

తాజాగా ఒడిశా లోని గంజాం జిల్లా ఇలాంటి పరువు హత్య ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గుండూరిబాడి గ్రామానికి చెందిన ఓ 17 ఏళ్ల యువతి ఆగస్టు 25న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది.

అయితే వేరే కులం యువకుడితో తన కూతురు వెళ్లిపోయిందని తండ్రి భావించి ఆ అమ్మాయి సెప్టెంబర్ 15న తన ఇంటికి తిరిగి వచ్చినా ఆమెను ఇంటిలోకి అనుమతించలేదు.దీనితో పక్క గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటిలో తలదాచుకుంటుంది.

ఈ నేపథ్యంలో యువతి తండ్రిని తమ ఇంటికి పిలిపించి మాట్లాడారు బంధువులు.ఎక్కడికి వెళ్లావు? ఎవరితో వెళ్లావు? అని తండ్రి కుమార్తెను ప్రశ్నించగా.ఆమె నుంచి సమాధానం రాలేదు.మొత్తానికి గొడవ సద్దుమణిగిన తర్వాత తన కూతురిని తీసుకుని ఇంటికి బయల్దేరాడు.అయితే మరి ఏమనుకున్నాడో గానీ ఆ తండ్రి మార్గమధ్యలోనే కర్కశంగా కుమార్తె గొంతు నులిమి ప్రాణాలను బలితీసుకున్నాడు.

Telugu Strangles, Ganjam Distict, Gunduribadi, Odisha-

  ఏమి జరగనట్లే మార్గ మధ్యలో ఉన్న చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేసి మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాడు.అనంతరం పోలీసులకు ఎలాగో సమాచారం అందడం తో ఆ యువతి తండ్రిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.దీనితో అతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఈ రోజుల్లో కూడా ఇలా కులం,మతం అంటూ ప్రాకుల్లాడుతూ చేతులారా తమ పిల్లలను తామే పొట్టనపెట్టుకుంటూ కసాయి వారిగా మారిపోతున్నారు తల్లిదండ్రులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube