ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది.శేఖర్ కమ్ములకు పితృ వియోగం ఏర్పడింది.
ఆనారోగ్యంతో బాధపడుతు శేషయ్య కమ్ముల ఈ రోజు ఉదయం మరణించారు.శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య కమ్ముల మృతి చెందడంతో వాళ్ల ఇంట విషాద చాయలు అలుముకున్నాయి.
గత కొంత కాలంగా అనారోగ్యంతో శేషయ్య బాధపడుతున్నాడు.ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా, ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకు చికిత్స పొందుతు ఆస్పత్రిలో కన్నుమూశాడు.పోస్టుమార్టం నిమిత్తం బన్సీలాల్ పేట స్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.
తండ్రి మరణంతో శేఖర్ కమ్ములతో పాటు అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
ప్రేమ కథలు, ఫ్యామిల్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోగా నాగ చైతన్య, హీరోయిన్ గా సాయి పల్లవి అలరించబోతున్నారు.సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు పూర్తయ్యాయి.ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
సినిమాను ఏప్రిల్ విడుదల చేయాలని భావిస్తున్నా.కరోనా నేపథ్యంలో ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి.