గత కొన్ని నెలల నుంచి కరోనా ప్రభావంతో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి.కానీ కొన్ని ప్రైవేట్ కళాశాలలో, కార్పొరేట్ యాజమాన్యం పిల్లలకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అందుకోసం పిల్లలకు స్మార్ట్ ఫోన్ ,ఇంటర్నెట్ సౌకర్యం కచ్చితంగా ఉండాలి.కానీ ఈ ఆన్ లైన్ తరగతులు ఓ తండ్రి వివాహేతర సంబంధాన్ని బయట పడ్డాయి.
దీంతో ఆ భార్య తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది.ఈ ఘటన తాజాగా కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే….
కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలోని నాగమంగళ తాలూకాలో ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ ప్రాంతంలో నివసించేటటువంటి ఓ వ్యక్తికి 18 ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి 15,17 సంవత్సరాల పిల్లలు ఉన్నారు.అయితే వారి చదువుల నిమిత్తం ఆన్ లైన్ తరగతులను స్కూలు యాజమాన్యం నిర్వహిస్తుండడంతో తన తండ్రి సెల్ ఫోన్ పిల్లల వద్ద ఉంచి వెళ్లారు.అయితే అందులో తమ తండ్రి ఒక మహిళతో వ్యక్తిగతంగా తీసుకున్న ఫోటోలను, వీడియోలను చూసి ఆ విషయాన్ని తమ తల్లికి తెలియజేశారు.
తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలియడంతో తన భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే తన భర్త తో సన్నిహితంగా ఉన్న సదరు మహిళ సమీప బంధువు కావడం విశేషం.అయితే ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని మహిళా పోలీసులను ఆశ్రయించింది.తన భర్త నుంచి విడిగా ఉంటానని మహిళ కోరడంతో, అందుకు భర్త తన భార్య తన దగ్గరే ఉండాలంటూ ఆరోపించారు.
అయితే పోలీసులు వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ, ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.దీంతో ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది.